Breaking News

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై పారిశ్రామిక వేత్తలు, నిపుణులతో టాస్క్ ఫోర్స్

-టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ గా సీఎం చంద్రబాబు, కో ఛైర్మన్ గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్
-సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ భేటీ – రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ
-సిఐఐ ప్రతినిధులతో ను ముఖ్యమంత్రి సమావేశం – అమరావతిలో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం
-రాజధానిలో ఇంటర్నేషన్ లా స్కూలు ఏర్పాటుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో చర్చ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనకు, వేగవంతమైన పారిశ్రామికాభివృద్ది సాధించేందుకు సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థల ఏర్పాటుకు చంద్రబాబు చర్చలు జరిపారు. ఇందులో భాగంగా పారిశ్రామికాభివృద్దికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. స్వర్ణాధ్రప్రదేశ్ – విజన్ 2047 రూపకల్పనపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, పారిశ్రామికాభివృద్దికి ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ లో దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, బిజినెస్ సెక్టార్ ప్రముఖులు, ఆయా రంగాల్లో నిపుణులు ఉండడనున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ కు ముఖ్యమంత్రి చైర్మన్ గా, ప్రముఖ వ్యాపార సంస్థ అయిన టాటా గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా వ్యవహరించనున్నారు. శుక్రవారం సచివాలయంలో టాటా చైర్మన్ తో భేటీ సందర్భంగా ఈ అంశంపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. ప్రత్యేకమైన విజన్ ద్వారా 2047 నాటికి ఎపిని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విజన్ ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనిలో భాగంగా పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. విశాఖలో టీసీఎస్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటు, రాష్ట్రంలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ తో పాటు పలు అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోన్న సోలార్ పవర్, టెలీకమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపైనా టాటా గ్రూప్ చైర్మన్ తో సీఎం చంద్రబాబు చర్చించారు.

అనంతరం సీఐఐ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయింది. సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అధ్యక్షతన వచ్చిన సిఐఐ ప్రతినిధి బృందంతో సిఎం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు తాము తెస్తున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో సీఎం చర్చించారు. అమరావతిలో సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఆన్ కాంపిటేటివ్ నెస్ సంస్థ ఏర్పాటుకు ఈ సిఐఐ ముందుకు వచ్చింది. అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ ఆన్ కాంపిటేటివ్ సంస్థ ఏర్పాటుపై చర్చించారు. దీనిలో టాటా గ్రూప్ భాగస్వామి కానుంది. అనంతరం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సిఎంను కలిశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా, కౌన్సిల్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతిలో ఇంటర్నేషన్ లా స్కూలు ఏర్పాటుపై సీఎంతో చర్చించారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *