విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలకు అనుగుణంగా మరియు యన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమీషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబు , ఐ.పి.యస్ వారి అదేశాల మేరకు, విజయవాడ నగరములోని ద్విచక్ర వాహన మెకానిక్ లకు మరియు డిస్ట్రిబుటర్స్ తో కే.చక్రవర్తి,డి.సి.పి. ట్రాఫ్ఫిక్ అధ్వర్యంలో శనివారం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మీటింగ్ నిర్వహించి, వారికీ రహదారి భద్రతా నియమాలు , MV Act చట్టాల మీద అవగాహన కల్పించినారు. అంతే కాక నగరంలో యువకులు వారి ద్విచక్ర వాహనములకు శబ్ద కాలుష్యము చేయు సైలేన్సర్స్ బిగించి రహాదారులపై తిరుగుచూ ప్రజలకు ఇబ్బంది కలుగచేయుచు భయ బ్రాంతులకు గురిచేయు చున్నందున, సదరు అంశముపై ఈ క్రింది సూచనలు చేసి వారికి నోటీసులు ఇచ్చి ఈ అంశము పై నగర ట్రాఫ్ఫిక్ విభాగము కఠిన చర్యలు తీసుకొబడునని తెలిపారు.
-కంపెనీ అమర్చిన సైలెన్సర్ తప్ప , వాహన దారుడు ఆన్ లైన్ లో కొన్నవి గాని, ఇతర రాష్ట్రములనుండి కొన్నవి శబ్ద కాలుష్యము కలుగ చేయు వాటిని బిగించరాదు
-శబ్ద కాలుష్యము చేయు సైలేన్సర్స్ మార్చమని వాహన దారులు ఒత్తిడి చేసిన యెడల పోలీసు వారికి సమాచారము ఇచ్చి సహాయము పొందవలయును.
-ద్విచక్ర వాహనముల సేల్స్ డిస్ట్రి బూటర్స్ మరియు మెకానిక్ లు లాభాపేక్షతో శబ్ద కాలుష్యము చేయు సైలేన్సర్స్ అమ్మరాదు మరియు వాహనములకు అమర్చరాదు.
-పోలీసు వారి తనిఖీలో శబ్ద కాలుష్యము కలుగ చేయు వాహనములను పట్టుకోన్నప్పుడు , వాహన దారులతో పాటు దానిని బిగించిన డిస్ట్రి బూటర్స్ మరియు మెకానిక్ పై కుడా చట్ట ప్రకారము చర్యలు తీసుకోనబడును
కావున ద్విచక్ర వాహన మెకానిక్ లు పై సూచనలు పాటించి విజయవాడ పోలీసు వారికి సహకరించి ప్రజల కు కలుగు అసౌకర్యము నివారించుటలో తమ వంతు సహకారము అందించావలసినడిగా కోరడమైనది. పై అవగాహనా కార్యక్రమానికి ట్రాఫిక్ ఏ.డి.సి.పి డి.ప్రసాద్ , ట్రాఫిక్ ఏ.సి.పిలు, మరియు సి.ఐల తో పాటు వీడు స్వచంద సంస్థ వాసు పాల్గొని పై సూచనలు చేశారు.