విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
8 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆక్యు ప్రెజర్, ఆక్యు పంచర్ సైన్స్ గుర్తింపు కార్యక్రమం మీద జులై 30న రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేసిన ప్రకటన పట్ల ఆస్ప భారత్ ఆక్యు పంచర్ సైన్స్ ప్రాక్టీస్ అసోసియేషన్ ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో హర్షం వ్యక్తం చేసింది. మందులు లేని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేని, ఈ వైద్య విధానం అతి త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవడం ద్వారా, మంచి ఆరోగ్య సౌకర్యం కలిగించాలని, కోరడమైనది. వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆక్యు పంచర్ కౌన్సిల్, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఆస్ప భారత్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మాకాల సత్యనారాయణ, నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ అలవాల రవి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ కాశీ మహంతి సునీత, ఏవీఎస్ కుమారస్వామి, జాయింట్ సెక్రటరీలు పుష్పలత, చిన్న అప్పారావు, అఫ్జల్ ఖాన్, శ్రీహరి, అస్రా ఫన్నీసా, ప్రభావతి పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …