మొవ్వ (కారకంపాడు), నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలో స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణ శుద్ధ పూర్ణిమ సోమవారం ఉదయం గం.08.51ని.లకు శ్రవణా నక్షత్రయుక్త కన్యాలగ్న పుష్కరాంశ శుభముహూర్తము నందు బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీముఖ లింగేశ్వర స్వామి వారి ఆద్యేష్టికోపధాన (శంఖుస్థాపన) కార్యక్రమం దేదీప్యమానంగా నిర్వహించారు. రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి సతీ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించారు. పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రొండి కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు, గ్రామస్తులు, ఆస్థిక మహాశయులు,ఆబాలగోపాలమంతయూ ఈ శివాలయ శంఖుస్థాపన పూజా కార్యక్రమంలో భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …