Breaking News

ప్రతిష్టాత్మకంగా గ్రామసభలు

-జిల్లాలో 300 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న గ్రామసభలను జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు గ్రామసభలు ఏర్పాటుపై మీడియోతో  మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన జరిగే గ్రామసభలలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ,మండల ప్రత్యేక అధికారులు గ్రామ సదస్సులో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామసభలు నిర్వహించి.. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవడం జరుగుతోందన్నారు. గ్రామ సభలకు అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను, సామాజిక బాధ్యత వహించే ప్రతిఒక్కరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ సభలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణ గ్రామ పంచాయతీల విధానంలో గ్రామ సభాల నిర్వహణా ఉండాలని స్పష్టం చేశారు. గ్రామ సభ సమాచారం ఇవ్వడంతో పాటు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు.

గ్రామ సభ నిర్వహణ లో నీటి సరఫరా, మౌలిక సదుపాయాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ, వీధి దీపాలు, సీసీ రోడ్లు, ఘన వ్యర్థ పదార్థాలు నిర్వహణ లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామ సభల్లో అనుసంధాన రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పన కోసం రూపొందించాల్సిన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ , కుళాయి కనెక్షన్లు, మరుగుదొడ్డి సౌకర్యం, ఎల్పీజీ సౌకర్యం తదితర అంశాలపై ఫలవంతమైన విధానంలో గ్రామ సభ ల నిర్వహించుకోవాలని అని తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *