Breaking News

గత ఐదేళ్లలో గ్రామ పంచాయతీల నిర్వీర్యం

-గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని
-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నామని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధి హామీ పథకం పనులపై గ్రామసభలు నిర్వహించారని తెలిపారు. జగన్ పాలనలో సర్పంచులు సైతం బిచ్చమెత్తుకున్న దుస్థితిని చూశామని అన్నారు. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను సైతం మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తన అకౌంట్లోకి మళ్లించుకున్నారని తంగిరాల సౌమ్య ఆరోపణలు చేశారు. గత ఐదేళ్లలో గ్రామ పంచాయతీలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారన్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *