మధురపూడి (కోరుకొండ), నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం హెలి క్యాప్టర్ ద్వారా రాజమండ్రి విమానాశ్రయం చేరుకొన్నారు. అనంతరం అక్కడ నుంచి చాపర్ లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లడం జరిగింది. మధురపూడి విమానాశ్రయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు అధికారులు ప్రజా ప్రతినిధులు ఘనవీడ్కోలు పలకడం జరిగింది. ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికిన వారిలో జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంతి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, ఎమ్మెల్యే లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామ కృష్ణ, ఆదిరెడ్డి వాసు, నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు ఉన్నారు
Tags rajamandri
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …