తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సహాయ పౌర సంబంధాల అధికారిగా గోపి నేడు భాద్యతలు చేపట్టారు. కడప జిల్లా , ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయం నందు సీనియర్ సహాయకులుగా పని చేస్తున్న గోపి కి సహాయ పౌర సంబంధాల అధికారిగా పదోన్నతి కల్పిస్తూ తిరుపతి కార్యాలయంలో ఖాళీగా ఉన్న స్థానం నందు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, కడప వారు పోస్టింగ్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నేడు శనివారం ఉదయం తిరుపతి సహాయ పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా కార్యాలయ సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Tags tirupathi
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …