Breaking News

యనమల కుదురు లోని మజీద్ ఏ ఫైజ్ నిర్వహణకు కేర్ కమిటీని రద్దు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా యనమలకుదురు లోని మస్జిద్ ఏ ఫైజ్ కమిటీ ని హైకోర్టు రద్దు చేసినట్లు అధ్యక్షులు అష్రాఫ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యనమలకుదురు లోని మజీద్ ఏ ఫైజ్ కమిటీ ఆధ్వర్యంలో కార్యకలాపాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్న నేపథ్యంలో కమిటీ సభ్యులు స్థానికులు సంతృప్తిగా ఉన్నా సరే ఉద్దేశపూర్వకంగా కొంతమంది ప్రోద్బలంతో వక్ఫ్ అధికారులు మజీద్ నిర్వహణ చేపడుతున్న మజీద్ ఏ ఫైజ్ కమిటీ సభ్యులను ఇబ్బందులను గురిజేస్తూ కమిటీ సభ్యుల ప్రమేయం లేకుండా కేర్ కమిటీని ఏర్పాటు చేయటం పై ఈ విషయాన్ని స్థానిక కమిటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు.గౌరవ హైకోర్టు కేర్ కమిటీని రద్దు చేసినట్లుగా మజీద్ ఏ ఫైజ్ అధ్యక్షుడు అష్రాఫ్ తెలియజేశారు స్థానికంగా కొంతమంది దురుద్దేశంతో కల్లోలాలు సృష్టించాలని ప్రయత్నిస్తూ ఉంటే వాటిని సర్ది చెప్పకుండా పవిత్ర మసీదు స్థలాలలో గొడవలకు ఆద్యం పోస్తున్న వక్ఫ్ అధికారుల తీరు మార్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. హైకోర్టు ఉత్తర్వులను గౌరవ హైకోర్టు వెబ్సైట్ నందు కేసు నెంబర్ ..17152..నెంబర్లలో సరిచూసుకోగలరని అధికారులను ఆయన కోరారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *