Breaking News

4 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్

ప్రకాశం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం మారెళ్లలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ను శనివారం ప్రారంభించారు. ఓర్సీహెచ్ సంస్థ నిర్వహణలో ఈ ప్లాంట్ రూపుదిద్దుకుంది. సుమారు 18 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్ ను కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేశారు. ఈ సోలార్ ప్లాంట్ నుంచి విద్యుత్ మారెళ్ల సబ్ స్టేషన్ కు అనుసంధానం చేశారు. అనంతరం ఇది గ్రిడ్ కు కనెక్ట్ అవుతుందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మీడియాతో మాట్లాడారు. సోలార్, విండ్ పవర్ కు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం మారెళ్లలోని వ్యవసాయేత భూముల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సోలార్ ప్లాంట్ లు రాష్ట్ర వ్యాప్తంగా మరెన్నో రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందని అన్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలను అందజేస్తోందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం హయాంలో కనీసం 100 మెగావాట్ల ఉత్పత్తి కూడా జరగలేదని మంత్రి ఆరోపించారు. దీంతో నాడు ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పలేదని అన్నారు. నేడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో ప్రజావసరాలకు, పారిశ్రామిక అవసరాలకు సరిపడ విద్యుత్ ను అందిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. భవిష్యత్తులో చంద్రబాబు సూచనతో సోలార్, విండ్, పీఎస్పీ వేస్ట్ మేనేజ్‍మెంట్ ప్లాంట్‍తో విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వివరించారు. రానున్న రోజుల్లో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో ఏపీని అగ్రగామిగా నిలిపే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు.అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య. దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. డాక్టర్ కడియాల లలిత్ సాగర్. విద్యుత్ ఎస్ ఇ కె వివి సత్యనారాయణ. డి ఈ ఎస్ కే కరీం. ఏ డీ ఈ కే పిచ్చయ్య. ఏ ఈ వీరబ్రహ్మం. ఐ ఎల్ ఐ ఓ ఎస్ సీఈవో నవీన్ ఉన్నాం. సీఈఓ అశోక. కంపెనీ ఇంజనీర్లు. టిడిపి నాయకులు మారెళ్ళ సుంకర రాఘవరెడ్డి. సోమేపల్లి శ్రీనివాసరావు. మట్ట సుబ్బారెడ్డి. తదితరులు పాల్గొన్నారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *