గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆవులు, పందులను, గాడిదలను యజమానులు తమ ఇంటి పరిసరాల్లోనే కట్టడి చేసుకోవాలని, రోడ్ల మీదకు వదిలితే వాటిని నగరపాలక సంస్థ సిబ్బంది స్వాధీనం చేసుకుంటారని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో నగర ప్రజలకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రదాన రోడ్లపై ఆవులను సదరు యజమానులు ఇష్టానుసారం వదిలి వేయడం వలన వాహనదార్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని సమయాల్లో తీవ్ర ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన రోడ్ల మీద సంచరించు పందుల నియంత్రణకు డబ్లుపి. నం.177912 ఆఫ్ 2017 గౌరవ హైకోర్ట్ ఆదేశాల మేరకు, మునిసిపల్ కార్పోరేషన్ చట్టం 1995 సెక్షన్ 510 ప్రకారం పందుల పెంపకందార్లు నగరపాలక సంస్థ నుండి లిఖితపూర్వక అనుమతులు, లైసెన్స్లు కల్గి ఉండాలన్నారు. అలాగే మునిసిపల్ కార్పోరేషన్ చట్టం 1995 సెక్షన్ 255 ప్రకారం స్వంత నివాసంలో ప్రజలకు ఇబ్బంది కలుగజేయు ప్రజా ఆరోగ్యానికి హానికరమైన ఎటువంటి జంతువులను తన నివాస లేదా గృహ ప్రాంగణంలో కలిగి ఉండడానికి వీలులేదన్నారు. అటువంటి పందులు, ఆవులు, గాడిదలు, పెంపుడు కుక్కలు రోడ్ల మీదకు వస్తే వాటిని ప్రజారోగ్య దృష్ట్యా నగరపాలక సంస్థ సిబ్బంది స్వాధీనం చేసుకొని, నగరపాలక సంస్థ బందెల దొడ్డికి తరలించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే సదరు యజమానులకు జరిమానాలు విధించడం,. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
Tags guntur
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …