Breaking News

ఖాళీ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని, ఆక్రమణల తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. మంగళవారం కమిషనర్ ఇన్నర్ రింగ్ రోడ్, టీచర్స్ కాలనీ, మల్లికార్జున పురం, అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు, పార్క్ లు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లే అవుట్ లో నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగా స్తలాలకు ఫెన్సింగ్ లేదా కాంపౌండ్ నిర్మాణాలకు, అవసరమైన ప్రాంతాల్లో పార్క్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు వార్డ్ ల వారీగా జిఎంసి ఖాళీ స్థలాల వివరాలతో నివేదిక ఇవ్వాలన్నారు. తొలుత టీచర్స్ కాలనీ పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల వివరాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ పనులు వేగంగా చేపట్టాలని, పనుల జాప్యం వలన పార్క్ ని ప్రజలు వినియోగించుకోవడానికి ఆటంకం కల్గుతుందని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్క్ ల్లో నాటే మొక్కల్లో ఔషద మొక్కలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఏడిహెచ్ కి తెలిపారు. టీచర్స్ కాలనీ ప్రాంతంలో డ్రైన్ లో మురుగు పారుదల లేదని, వెంటనే కచ్చా కాల్వ ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణం, త్రాగునీటి పైప్ లైన్ ఏర్పాటు పై అంచనాలు సిద్దం చేయాలని ఈఈని ఆదేశించారు. సదరు ప్రాంతంలో అనధికార బోర్లు వేసి నీటి విక్రయాలు చేస్తున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు త్వరలో వాటి పై ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు చేపట్టి నిబందన మేరకు లేని వాటి నిర్వహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం అమరావతి రోడ్ లో మెయిన్ రోడ్ పై ఆక్రమణలు గమనించి సంబందిత సచివాలయ ప్లానింగ్ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసి, తక్షణం ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. పారిశుధ్య పనులు మెరుగవ్వాలన్నారు.
పర్యటనలో ఈఈ శ్రీనివాస్, డిఈఈ సతీష్, ఏడిహెచ్ రామారావు, ఏసిపి మురళి, టిపిఎస్ సువర్ణ కుమార్, ఎస్ఎస్ సోమ శేఖర్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *