Breaking News

మంచినీటి సమస్యలు వెంటనే పరిష్కరించండి

-అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంచినీటి సమస్యని సత్వరమే పరిష్కరించాలని మరమ్మతుల్లో ఉన్న వాల్వ్ ను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ఫైజర్ పేట పర్యటించి క్షేత్ర స్థాయి లో పరీశీలించారు. పారిశుద్ధ్య నివారణ సక్రమంగా జరగాలని కాలువల్లో గ్రేటింగ్ పెట్టడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ సులభతరం చేస్తూ, పారిశుద్ధ్య నిర్వాహణ చెయ్యాలని అన్నారు. తన పర్యటనలో భాగం గా మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్వాహణ పరిశుభ్రంగా ఉండాలని, ఎటువంటి అపరిశుభ్రతకు అవకాశం లేకుండా మరుగుదొడ్ల నిర్వహణ చేయాలని ఆదేశించారు. సైడ్ కాలవల్లోని పూడికలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, రోడ్డు పైన ఉన్న వ్యర్థలను ఎప్పటికప్పుడు తీస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తో పాటు జోనల్ కమీషనర్ రమ్య కీర్తన, యస్ ఈ (ప్రాజెక్ట్స్) రామ్మోహన్, ఈ ఈ ఏ. యస్.ఎన్ ప్రసాద్,డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్ర బోస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *