విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
“ఏక్ పేడ్ మాకేనామ్” (అమ్మ కోసం ఒక మొక్క) అంటూ నగరంలో వన మహోత్సవ కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ నగర పరిధిలో సర్కిల్ వన్ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురం నందు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు పురందరేశ్వరి, 46వ డివిజన్ మిల్క్ ప్రాజెక్ట్ బస్ స్టాప్ నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సర్కిల్ టు పరిధిలోని ఒకటొవ డివిజన్ కెనాల్ బాండ్ వద్ద సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, సర్కిల్ 3 పరిధిలోని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్రావు, మొక్కలను నాటి హరితాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు పురందరేశ్వరి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, కేవలం ఒకరోజు తోనే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడానికి సాధ్యమైనంత మొక్కలు ప్రతి ఒక్కరూ నాటాలని అన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్రావు, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర మాట్లాడుతూ మొక్కలను నాటడమే కాకుండా వాటి పరిరక్షణ చూసుకోవాలని, నాటిన ప్రతి మొక్క ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండేటట్టు వాటి పరిరక్షణ జరగాలని, ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోస్తూ వాటిని సంరక్షించుకోవాలని, ఉన్న మొక్కలను పరిరక్షిస్తూ కొత్త మొక్కలను నాటుతూ కాలుష్యాన్నిఅరికట్టాలని అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 64 డివిజన్లోనూ ప్రతి ఒక్క డివిజన్లో ప్రజా ప్రతినిధులు, నగర పౌరులు, విద్యార్థినీ విద్యార్థులు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొని మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించడానికి తమ వంతు కృషిని అందించారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …