Breaking News

ఎస్సి. ఎస్టీ వర్గీకరణ. క్రిమిలేయర్ అమలు కు వ్యతిరేకంగా పోరాటం ఉదృతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సి. ఎస్టీ వర్గీకరణ. క్రిమిలేయర్ అమలు కు వ్యతిరేకంగా పోరాటం ఉదృతం చేయాలని. వర్గీకరణ చేస్తూ రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానం ను రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ NDA రాష్ట్ర సర్కార్ ను డిమాడ్ చేస్తూ..
ఎస్సీ. ఎస్టీ. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగు పోరాటాన్ని జయప్రదం చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. నేడు గాంధీనగర్ లోని విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశం ను నిర్వహించడం జరిగింది. సమితి జాతీయ చైర్మన్. దళిత బహుజన పార్టీ DBP జాతీయ అధ్యక్షులు. సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ మాట్లాడారు. దశలి వారి పోరాట కార్యాచరణ ను ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 2 వ తేదిన మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. 11 వ తేదిన ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద ధర్నా. 16 వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం. 27 వ తేదిన రాష్ట్ర స్థాయి ర్యాలీ. ధర్నా. విజయవాడ లో.. అక్టోబర్ రెండో వారం లో ఛలో అమరావతి సచివాలయం ముట్టడి కార్యక్రమం ను విజయవంతం చేయాలని కృష్ణ స్వరూప్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో పార్టీ ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్. జి. కె. బాబు. జాతీయ మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి మాదే సుజాత. రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ ఉప్పాడ. రామచంద్రరెడ్డి.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జిలాని. ఎన్టీఆర్ జిల్లా డి. వినయ్ కుమార్. కృష్ణ జిల్లా కన్వీనర్ నల్ల బోలు సామి్యులు. సమితి ఏపీ రాష్ట్ర కన్వీనర్ ఆవుల ప్రవీణ్ కుమార్. రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ బి. డేవిడ్ రత్నకుమార్ రాష్ట్ర కో. కన్వీనర్స్ మదిరి. అంబేద్కర్. సుదర్శన అజయ్ కుమార్.ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ రాచూరి. విజయ్ కుమార్. తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *