గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 58,798 మంది పెన్షనర్లకు ఆగస్ట్ 31వ (శనివారం) తేదినే నూరు శాతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గుంటూరు నగరంలో సెప్టెంబర్ నెలకు సంబందించిన పెన్షన్లను ఆగస్ట్ 31 వ తేదినే నూరు శాతం పూర్తి చేయడానికి వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామని తెలిపారు. నగరంలోని 206 వార్డ్ సచివాలయాల పరిధిలోని వివిధ కేటగిరిలకు సంబందించి 58,798 మంది పెన్షనర్లకు రూ.25,04,20,000లను వారి ఇంటి వద్దనే 1410 మంది వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా అందించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. పెన్షన్ ల పంపిణీ సజావుగా జరిగేలా పర్యవేక్షణకు ముగ్గురు డిప్యూటీ కమిషనర్లన ఆధ్వర్యంలో 42 మంది నోడల్ అధికారులను నియమించామని తెలిపారు. పెన్షన్ల పంపిణీ విధులు కేటాయించబడిన కార్యదర్శులు ఆగస్ట్ 31వ తేదీకి ముందే తమకు కేటాయించిన ప్రాంతం, పెన్షనర్ల సంఖ్య(కేటగిరి వారిగా), పంపిణీ చేయాల్సిన నగదు తదితర అంశాలను పరిశీలిమ్చుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే ముందుగానే నోడల్ అధికారి ద్వారా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పెన్షన్ పంపిణీ ఉదయం 6 గంటల నుండే ప్రారంభించాలని, ప్రతి గంటకు పంపిణీ చేసిన శాతం జిఎంసికి తెలియచేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శుల పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Tags guntur
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …