Breaking News

మెగాజాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా, కలెక్టర్  చేతుల మీదుగా మెగాజాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో 06- 09-2024 తేదీన అనగా ఈ శుక్రవారం, సత్యవేడు లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల(Govt Polytechnic College,Sathyavedu)నందు జరగబోయే మెగా జాబ్ మేళా కొరకు ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్, డాక్టర్.S. వెంకటేశ్వర్ చేతుల మీదుగా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది.

ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం,శ్రీ సిటీ మరియు చెన్నైలోని 10 బహుళ జాతీయ కంపెనీలలో 500 ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ మెగాజాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను అని తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి,ఆర్ లోకనాథం గారు, ఒక ప్రకటనలో తెలియజేశారు మరిన్ని వివరాలకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు.

రిజిస్ట్రేషన్ లింకు: https://shorturl.at/if7XT

రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 05-09-2024.

ఇతర వివరములు కొరకు సంప్రదించండి: 9440374535,9491458910.

ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ శ్రీ.పెంచల కిషోర్, ఎస్ డి సిలు రామ్మోహన్, నరసింహులు, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, గోపి కృష్ణ, డిఆర్డిఏ పిడి ప్రభావతి , గణేష్, మహేష్, కోఆర్డినేటర్ మొదలగువారు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *