గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ నగరంలోని ముంపు ప్రభావిత ప్రజలకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున బిస్కెట్స్, పాలు, బ్రెడ్, పులిహోర అందిస్తున్నామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీ వర్షాల వలన విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ముంపుకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, సంచాలకులు హరి నారాయణ మురగన్ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ తరఫున ఆదివారం పాలు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్, బ్రెడ్ ప్యాకేట్స్ అందించామని, సోమవారం కూడా షుమారు 55వేలు పులిహోర, 31,200 వేల వాటర్ బాటిల్స్, 52 వేలు బిస్కెట్ ప్యాకెట్స్, 23 వందల బ్రెడ్ ప్యాకెట్లు అందిస్తున్నామని తెలిపారు. ఆహారం, వాటర్ బాటిల్స్ లను విజయవాడకు ప్రత్యేక వాహనాల ద్వారా పంపిస్తున్నామని, విజయవాడలోని పర్యవేక్షణ అధికారులు అందే వరకు జిఎంసి నుండి ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు.
Tags guntur
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …