-స్పెషల్ ఆఫీసర్లుగా ఒక ఆఫీసర్, వార్డ్ సెక్రటరీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంతంలో ప్రజలకు ఆహారం చేసేటట్టు చూసుకోవాలని బోట్ల సహాయంతోనే కాకుండా హెలికాప్టర్ల ద్వారా కూడా ఆహారం పంపించేటట్టు చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, మంగళవారం క్రెడాయ్ విజయవాడ వారు తయారుచేసిన ఆహార పొట్లాలు, మంచినీరు పంపిణీకు హెలికాప్టర్ ద్వారా కూడా భోజనం పంపిణీ చేస్తున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వార్డ్ సెక్రటరీలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఆహారం పంపిడి అందరికీ చేరేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన ఫిర్యాదులకు వెంటనే చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి సహాయం అందిటట్టు చూసుకోవాలని ఆదేశించారు. అందులో భాగంగా 58వ డివిజన్లో గల తోట వారి వీధి, ఇంద్ర నాయక్ నగర్, నందమూరి నగర్, అజిత్ సింగ్ నగర్ లోని వడ్డెర కాలనీ, కె.ఎల్ రావు నగర్ రోడ్, పి ఎన్ టి కాలనీ, బసవపున ఇండోర్ స్టేడియం ప్రాంతం, 59వ డివిజన్లో గల ఏ ఎస్ ఎన్ అపార్ట్మెంట్ ప్రాంతం, అజిత్ సింగ్ నగర్,గంగానమ్మ గుడి, ఎంకే బైగ్, లూనా సెంటర్ ప్రాంతం, 60 డివిజన్ లోగల ఏ బి సి డి ఈ ఎఫ్ జి బ్లాక్ బాంబే కాలనీ, 61 డివిజన్లో గల శాంతినగర్, ప్రశాంతి నగర్, సరదా స్కూల్ ప్రాంతం, హెచ్ బ్లాక్ వాంబే కాలనీ, 62 డివిజన్లో గల న్యూ పైకాపురం, ఫైర్ స్టేషన్ ఏరియా, ప్రకాష్ నగర్, ఎల్ బి ఎస్ నగర్, 63వ డివిజన్లో గల ఎంఐజి వుడా కాలనీ, న్యూ రాజీవ్ నగర్, రాధా నగర్, సుందరయ్య నగర్, ఓల్డ్ రాజీవ్ నగర్, ఉడా కాలనీ, 64వ డివిజన్లో గల కుండ వారి కండ్రిక, ఎన్ ఎస్ సి బోస్ నగర్, బివి సుబ్బారెడ్డి స్కూల్ ప్రాంతం, ప్రజాశక్తి నగర్, విద్యాసాగర్ ఎన్జీవో కాలనీ లలో నివసిస్తున్న ప్రజలకు హెలికాప్టర్ ద్వారా ఆహారం అందేటట్టు చూసుకోవాలని, మరోవైపు బూట్ల సహాయంతో ఆహార పంపిణీ కూడా చేస్తూ ప్రజలందరికీ ఆహారం విషయంలో ఎటువంటి లోపం లేకుండా ప్రతి ఒక్కరికి భోజనం చేరేటట్టు చూసుకోవాలని అందుకు వార్డు సెక్రటరీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు.