Breaking News

నష్ట పోయిన ప్రజలకు అండగా నిలవడానికి దాతలు ముందుకు రావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు, వరదల వలన తీవ్రంగా నష్ట పోయిన ప్రజలకు అండగా నిలవడానికి దాతలు ముందుకు రావాలని, దాతల నుండి నగదు లేదా వస్తువుల సేకరణకు గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిందని కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి ఇళ్లు కూడా ఖాళీ చేసి ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు ప్రజలు చేరుకున్నారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవడానికి అవసరమైన నగదు లేదా వస్తువులు ఇచ్చేందుకు గుంటూరు నగరంలోని దాతలు ముందుకు రావాలని కోరారు. గుంటూరు నగరంలో దాతలు అందించడానికి వీలుగా హిందూ కాలేజి సెంటర్ లోని నగరపాలక సంస్థ ట్రావెలర్స్ బంగ్లాలో లోని 5 వ నెంబర్ గదిలో సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెల్ ల్లో దాతలకు వారు అందించిన నగదు లేదా వస్తువులకు తగిన రశీదు అందించి, అందుకు నిర్దేశిత రిజిస్టర్ లో వివరాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలిచేందుకు గుంటూరు నగర ప్రజలు సత్వరంగా ముందుకు వస్తారాని ఆకాంక్షిస్తున్నామన్నారు. వివరాలకు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ 98499 08396 ని సంప్రదించవచ్చని తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *