బిక్కవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ వరద బాధితుల సహాయార్థం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి ఆదేశాల మేరకు బిక్కవోలు మండలం నుంచి 1500 ఫుడ్ ప్యాకెట్లు విజయవాడ కు పంపించడం జరిగిందనీ తహసిల్దార్ డబ్ల్యూ ఎల్ రమణి తెలియ చేశారు. మంగళవారం విజయవాడకు ఆహారాన్ని పంపుతున్న వాహనానికి జెండా ఊపి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ రమణి వివరాలు తెలియ చేస్తూ, బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలోని కేపీఆర్ క్రాప్ సైన్సెస్ ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో 1500 ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేసి, విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వారికి పంపించడం జరిగిందన్నారు.
Tags rajamandri
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …