-నగరంలో పారిశుధ్య నిర్వహణ కోసం ఇతర మున్సిపాలిటీల నుంచి అధికారులను రప్పించిన మంత్రి నారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలో మంగళవారం సాయంత్రం మున్సిపల్ శాఖ మినిస్టర్ పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు,మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, టీడ్కో ఎండీ సాయి కాంత్ వర్మ, వీఎంసి కమిషనర్ ధ్యాన చంద్ర, సమక్షంలో వివిధ మున్సిపల్ ఉన్నతాధికారులు,టౌన్ ప్లానింగ్,ఇంజినీరింగ్ విభాగాల ఉన్నతాధికారులు తో సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 63 మందిని పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేకాధికారులు నియమించారు. ఇతర మున్సిపాలిటీల నుంచి సుమారు 4 వేల మంది పారిశుధ్య కార్మికులను విజయవాడ కు రప్పించనున్నారు అని అన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన పారిశుధ్య పనులపై అధికారులను వివరించారు. వరద ముంపు ప్రాంతాల్లో సురక్షితంగా బాధితులను బయటికి తరలించారని, దాదాపు బాదితులందరికీ ఆహారం అందేలా ఏర్పాట్లు చేశారని.కేవలం మంగళవారం 8.5 లక్షల ఫుడ్ ప్యాకెట్లు టిఫిన్ కోసం,మరో 8.5 లక్షల అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారని, 5 లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారని అన్నారు .
నీరు తగ్గిన తర్వాత రోడ్లపై మురుగు లేకుండా పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెడుతున్నారని, ముంపు ప్రాంతాల్లో పారిశుధ్యం సాధారణ స్థితికి తీసుకురావడానికి 10 వేల మంది కార్మికులు అవసరమని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల కమిషనర్లకు వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారని అన్నారు మంత్రి నారాయణ. ఒక్కో సచివాలయానికి ఒక్కో ప్రత్యేకాధికారి ఉంటారని, వరద నీరు తగ్గగానే ఫైర్ డిపార్ట్మెంట్ తో కలిసి ట్యాంకర్ల తో రోడ్లు శుభ్రం చేయాలని, బ్లీచింగ్,ఫాగింగ్ పనులు వెంటనే చేపట్టాలని, వైద్యారోగ్య శాఖతో కలిసి మెడికల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు.