-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధనచంద్ర మంగళవారం ఉదయం కండ్రిక జంక్షన్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఉన్న ప్రజలకు బోట్ సహాయం అందుతుందా లేదా, భోజనం బోట్ల ద్వారా కానీ, ట్రాక్టర్ ద్వారా కానీ ప్రజలందరికీ అందుతున్నాయా లేదా వార్డ్ సెక్రటరీలు అప్రమత్తంగా ఉన్నారా లేదా, ప్రజలకు ఇంకేమైనా అవసరం ఉందా అన్న అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్లై ఓవర్ పైన పంపిణీ చేశాక మిగిలి ఉన్న వ్యర్ధాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తుండాలని, పారిశుద్ధ్య నిర్వహణ కూడా ఖచ్చితంగా జరిగేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.