Breaking News

ప్రతి ఒక్కరికి ఆహారం చేరేలా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరికి ఆహారం చేరేలా ప్రతి డివిషన్లో ప్రతి సందులో చివరి ఇంటి వరకు ఆహారం వెళ్లిలా చూసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అదేశాల మేరకు విజయవాడ, ఎంజీ రోడ్ లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నుండి వరద ప్రభావిత ప్రాంతాలలో ఆహార పంపిణీ జరుగుతుంది. విజయవాడ నగర పరిధిలో ఉన్న వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రతి ఒక్కరికి ఆహారం చేరేటట్టు విజయవాడ నగరపాలక సిబ్బందిని, సెక్రటరీని, వాలంటీర్లని, ప్రతి ఒక్క వార్డులో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఆహారం చేరేటట్టు చర్యలు తీసుకుంటున్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. అందులో భాగంగా ఆహార పంపిణీకి వెళుతున్న వ్యాన్లలో ఒక సెక్రటరీ ఆ వ్యాన్లో ఆహారం పంపిణీకి వెళ్తున్నట్లు, ప్రతి ఒక్క వార్డ్ లో ప్రతి ఒక్క కుటుంబానికి ఆహారం చేరేటట్టు సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో నిరంతరం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *