-కార్యకర్తకు ఆర్థిక సాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో 46 వ డివిజన్లో బుధవారం గుండెపోటుతో మరణించిన సత్యాల పానకాలరావు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి వారి కూతురు లలితాంబను పరామర్శించారు. నిరుపేద అయినటువంటి పానకాలరావు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని స్థానిక విలేకరులు సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే తమ కార్యాలయ సిబ్బందికి మట్టి ఖర్చుల నిమిత్తం రూ 10,000 వేలను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది నగదును అందజేశారు. కార్యకర్తలకు ఎన్డీయే కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే సుజనా కు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.