Breaking News

విజయవాడ లో ముంపు బారిన పడిన లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ధైర్యం చెబుతూ స్వయంగా భోజనం, త్రాగునీటిని అందిస్తున్న.. మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని కొన్ని లోతట్టు  ప్రాంతాలు నీట మునగటం వలన ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఇది చాలా బాధాకరమైన విషయమని, ముంపు బాధితులను ప్రభుత్వాన్ని విధాలు ఆదుకుంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ నగరంలోని వరద ముంపుకు గురైన విద్యాధరపురం, కబేల సెంటర్ లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని ఆ ప్రాంత వరద బాధితులకు ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్ అందజేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు వలన విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు గురికావడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముంపుకు గురైన  లోతట్టు ప్రాంతాలను  పరిశీలించి ప్రజలకు ధైర్యం చెబుతున్నారన్నారు. ప్రజలకు సహాయ సహకారాలు అందించే విధంగా  ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ప్రభుత్వ యంత్రాంగం  రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన సహాయక పునరావాస కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేసామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముంపు గురైన భవాని ప్రాంతంలో ట్రాక్టర్ ట్రక్కులో నిలబడి ముంపు బాధితులకు మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ఆహార పదార్థాలను త్రాగునీటిని అందిస్తున్నారు. వరదల తగ్గిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం వరద ముంపు ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ చేసి బాధితులును ఆదుకుంటుందని మంత్రి తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *