Breaking News

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..

-పండగ రోజు కూడా రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు..
-7 రోజులుగా విజయవాడలోనే ప్రభుత్వ యంత్రాంగం..
-2 రోజుల్లో సాధారణ పరిస్థితి.. యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు..
-గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు..
-బ్యారేజీని డ్యామేజ్ చేయాలని చూశారు.. దీనిపై సమగ్ర విచారణ జలగాల్సి ఉంది
-కొల్లు రవీంద్ర, రాష్ట్ర మైన్స్ జియాలజీ & ఎక్సైజ్ శాఖ మంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
* సర్వవిఘ్నాలు తొలగాలని విజయవాడ కలెక్టరేట్లో వినాయక చవితి నిర్వహించుకుంటున్నాం.
* పండగ పూట కూడా నిద్రాహారాలు మాని రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు.
* 7 రోజులుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని విజయవాడలోనే పెట్టారు.
* విజయవాడ కలెక్టరేట్ నుంచే ప్రజల కోసం ప్రతి నిమిషం కష్టపడుతున్నారు.
* 2 రోజుల్లో సాధారణ పరిస్థితి నెలకొనేలా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
* ముంపు ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, పాలు, మెడిసిన్స్ తదితర నిత్యావసరాలు సరఫరా జరుగుతున్నాయి.
* నిన్న ఏరియల్ సర్వే ద్వారా విజయవాడలో పరిస్థితిని సీఎం చంద్రబాబు పర్యవేక్షించారు.
* కేంద్ర బృందాలు రాష్ట్రానికి వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
* స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఉత్సాహవంతంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
* గత ప్రభుత్వ నాయకులు పండుగను కూడా రాజకీయం చేస్తున్నారు.
* చంద్రబాబు తన ఇల్లు కాపాడుకోవడం కోసం ఇక్కడకు వచ్చారని విమర్శిస్తున్నారు.
* విజయవాడలో ప్రస్తుత పరిస్థితులకు గత ప్రభుత్వమే కారణం.
* బుడమేరు గండ్ల పూచే పనులు మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో వేగంగా జరుగుతున్నాయి.
* ఈ పనులకు భగవంతుని సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నా.
* ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల ఘటనపై అనుమానాలు కలుగుతున్నాయి.
* బోట్ల మీద ఉన్న రంగులు చూస్తే అనుమానాలు కలుగుతున్నాయి.
* బ్యారేజీని కూడా డ్యామేజీ చేయాలని చూశారు.
* దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
* దీని వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలే ప్రసక్తి లేదు.
* ఆ బోట్లు గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా ఉపయోగించిన బోట్లలా కనిపిస్తున్నాయి..
* వరద బాధితులకు ఆరు రకాల నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం.
* బియ్యం, కందిపప్పు, మంచి నూనె ఇలా ఆరు రకాల వస్తువులు ఇస్తున్నాం.
* ఎవరు ఎంత నష్టపోయారనే దానిపై కూడా చర్యలు చేపట్టాం.
* ఇప్పటికే బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమీక్షించడం జరిగింది.
* ఫైర్ ఇంజన్లతో ఇళ్లను శుభ్రం చేయడం, బ్లీచింగ్ చల్లటం వంటి తదితర శానిటేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
* వరదల వల్ల నష్టపోయామనే భావన కనిపించకుండా ప్రజల కళ్ళల్లో ఆనందం కలిగించాలనే తపనతో సీఎం చంద్రబాబు తపన పడుతున్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *