Breaking News

త్వరలో ఇరిగేషన్ కాలువల సమగ్ర సర్వే

-ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక చొరవ.
-విజయవాడ వరదల నేపథ్యంలో కాలువలు, డ్రైన్ల ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి.
-చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి.
-రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
200 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు, కృష్ణానదికి పోటెత్తిన వరద, బుడమేరుకు పడిన గండ్లు.. వీటి కారణంగా విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని.. ఈ అనుభవం నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలో ఇరిగేషన్ కాలువల సమగ్ర సర్వేను చేపట్టనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. విజయవాడ వరదల నేపథ్యంలో కాలువలు, డ్రైన్ల ప్రక్షాళనకు పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. అదేవిధంగా కాలువలు, డ్రెయిన్ల ఆధునికీకరణకు చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఆక్రమణల తొలగింపునకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. తగిన చర్యలు తీసుకునేందుకు ఇప్పుడున్న చట్టం సరిపోతుందని.. అవసరమైతే కొత్త చట్టం అయినా చేసేందుకు సిద్ధమన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలు ఎన్యూమరేషన్ చేస్తున్నాయని.. అవసరమైతే మరిన్ని బృందాలను పెట్టి త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఒకవేళ ఎవరైనా ఇళ్ల వద్ద లేకపోతే వారు తిరిగి వచ్చిన తర్వాత ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుందని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు.

ఇంకా ఏమన్నారంటే…
పది రోజుల క్రితం విజయవాడ, పరిసర గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. నగరంలోని 64 డివిజన్ల లో 32 డివిజన్లు ముంపునకు గురయ్యాయి.
– కొన్ని డివిజన్లలో 10 అడుగులు, 8 అడుగులు, ఆరడుగులు, నాలుగు అడుగుల వరకు నీళ్లు వచ్చాయి.

– 200 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత వర్షం రావడం, కృష్ణానదికి 11.43 లక్షల క్యూ సెక్కుల నీళ్లు రావడం, బుడమేరు గండ్ల ద్వారా వచ్చిన నీళ్లతో నగరానికి భారీ ఎత్తున నీళ్లు వచ్చి మనకకు గురైంది.

– స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ కార్యాలయంలోనే ఉండి సహాయక చర్యలకు మార్గ నిర్దేశం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి స్వయంగా పర్యవేక్షించారు. సహాయక చర్యల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేశారు.

– సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాన్ని పర్యటించినప్పుడు ప్రజలు ఇబ్బందులను గమనించి నగరం మళ్లీ సాధారణ స్థితికి చేరేవరకు విజయవాడ కలెక్టరేట్లోనే ఉంటానని చెప్పి.. రాత్రింబవళ్లు పనిచేశారు.

– 32 డివిజన్లలో ఇప్పటికే 26 డివిజన్లలో నీళ్లు క్లియర్ చేశామని ఇంకా ఆరు డివిజన్లలో కొన్ని నీళ్లు ఉన్నాయి. ఈ డివిజన్లలో రేపు ఉదయం కల్లా నీళ్లు పూర్తిగా పోయేలా అధికారులు, సిబ్బంది స్పెషల్ డ్రైవ్ కింద కృషి చేస్తున్నారు.

– రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 7,500 మంది శానిటేషన్ వర్కర్స్, నగరంలో 3,000 మంది మొత్తం కలిపి 10,000 మంది శానిటేషన్ వర్కర్స్ రేయింబవళ్ళు పనిచేస్తున్నారు.
– అంత వరద నీరు వచ్చినా ప్రభుత్వం ప్రత్యేక చర్యలతో నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగింది.
– రోజుకు 12 లక్షల ఆహార ప్యాకెట్లు బాధితులకు అందించామని, ఒక్కో రోజు 8 లక్షలు, ఇంకో రోజు 6 లక్షలు నిన్న కూడా 3 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ అందించాం.

– మొదట్లో 30 లక్షల వాటర్ బాటిళ్ళు, ఇంకో రోజు 26 లక్షలు, 20 లక్షలు, నిన్న 10 లక్షలు అందించాం.

– బిస్కెట్ ప్యాకెట్స్ మొదట్లో 12 లక్షలు, 10 లక్షలు, 8 లక్షలు, నిన్న 3 లక్షలు అందించాం.
* విద్యుత్తు, మంచినీటి సరఫరాను పునరుద్ధరించాం. నిన్న ఇచ్చిన వాటర్ కనెక్షన్లకు సంబంధించి మాత్రం ఈ నెల 12వ తేదీ వరకు నీటిని తాగడానికి, వంటకు ఉపయోగించవద్దని మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.
– ముఖ్యమంత్రి ఐవీఆర్ఎస్ ద్వారా, ఫిజికల్ మార్గాల ద్వారా, స్వయంగా ఫీడ్ బ్యాక్ తీసుకొని.. సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించేలా క్షేత్రస్థాయిలో అధికారులకు సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తున్నారు..

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *