-సీఎం రిలీఫ్ ఫండ్కు రూ. 25 లక్షలు అందించిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ
-మంత్రి టి.జి భరత్కు రూ. 25 లక్షల చెక్కు అందజేత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు అందించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులు మంత్రి టి.జి భరత్ను కలిసి రూ. 25 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందని చెప్పారు. ప్రజలను వరద కష్టాల నుండి బయటకు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. రూ.25 లక్షలు అందించిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యాన్ని టి.జి భరత్ అభినందించారు.