Breaking News

అనుమతి లేని బోర్డ్ లను తొలగిస్తాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ అనుమతితో నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి ప్రకటన బోర్డ్ నిర్దేశిత మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజులు చెల్లించాలని, ఫీజులు చెల్లించని, అలాగే అనుమతి లేని బోర్డ్ లను తొలగిస్తామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం పట్టణ ప్రణాళిక అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఫీజులు చెల్లించని, అనధికార హోర్డింగ్లు, బోర్డ్ లను, ఫ్లెక్సీలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్రకటనల హోర్డింగ్స్ యజమానులు మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజులు సక్రమంగా చెల్లించాలని, లేకుంటే సదరు బోర్డ్ లను తొలగించి, ఫీజుల వసూళ్లకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులు అనధికార హోర్డింగ్, ఫీజులు చెల్లించని వాటిని తొలగించారన్నారు. అనధికార బోర్డ్లు, హోర్డింగ్స్ నగరంలో ఉండడానికి వీలు లేదని, అటువంటి వాటిని ఎప్పటికప్పుడు తొలగించడానికి పట్టణ ప్రణాళిక అధికారులు స్పెషల్ టీంను అందుబాటులో ఉంచాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. నగరంలో వార్డ్ సచివాలయాల వారిగా ప్లానింగ్ కార్యదర్శులు అనధికార, ఫీజులు చెల్లించని బోర్డ్ లను గుర్తించి, వాటిని తొలగించాలన్నారు. నగరంలో ఇష్టానుసారం రోడ్లకు అడ్డుగా ఫ్లేక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, వాటిని కూడా తొలగించాలన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్ల విస్తరణ చేస్తున్నామని, కొందరు రోడ్ల మీద వ్యాపారాలు చేస్తూ ట్రాఫిక్ కి అంతరాయం కల్గిస్తున్నారన్నారు. రోడ్, ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపులో రాజీపడకూడదన్నారు. ప్రకటనల బోర్డ్ ల నిర్వహకులు తప్పనిసరిగా బకాయిలతో పాటుగా ప్రస్తుత ఏడాది డిమాండ్ కూడా చెల్లించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సిటి ప్లానర్లు అజయ్ కుమార్, మురళి, టిపిఎస్ లు సువర్ణ కుమార్, లక్ష్మణ స్వామి, టిపిబిఓలు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *