Breaking News

ఎక్క‌డైనా నీరు ఉంటే త్వ‌రిత‌గ‌తిన బ‌య‌ట‌కు పంపేలా అన్ని చ‌ర్య‌లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లోత‌ట్టు ప్రాంతాల్లో ఇంకా ఎక్క‌డైనా నీరు ఉంటే త్వ‌రిత‌గ‌తిన బ‌య‌ట‌కు పంపేలా అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, బుడమేరు ఉద్ధృతి కారణంగా విజయవాడ రూరల్ అంబాపురం ప్రాంతంలో ఇంకనూ ఉన్న నీటిని త్వరితగతిన బ‌య‌ట‌కు పంపేలా చర్యలు తీసుకోవాల న్నారు. బుధ‌వారం పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ కె.కన్నబాబు, జిల్లా కలెక్టర్ డా. జి.సృజనతో కలసి అంబాపురంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పల్లపు ప్రాంతాలలో ఇంకనూ నిల్వఉన్న నీటిని బ‌య‌ట‌కు పంపేలా కల్వర్టులలో డీసిల్టింగ్ చేసి నీరు వేగవంతంగా పారేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంద‌ర్శ‌న‌లో డీపీవో ఎన్‌వీ శివ‌ప్ర‌సాద్ యాద‌వ్ త‌దిత‌రులు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *