గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ వరద బాదితులకు నిత్యవసర సరుకులతో కూడిన కిట్స్ అందించిన గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం సభ్యులకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మున్ముందు కూడా సంఘం చొరవ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు కోరారు. ఆదివారం స్థానిక కన్నావారి తోటలోని గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం (మెయిన్ సర్వీస్) సభ్యులు విజయవాడ సింగ్ నగర్ లో వరద ప్రభావితులకు అందించనున్న 400 నిత్యవసర సరుకుల కిట్స్ వాహనాన్ని నగర కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తాము 12 రోజులు సహాయక, పునరుద్దర చర్యల్లో నేరుగా పాల్గొని, అక్కడి ప్రజల కష్టాలను గమనించామని, వారిని ఆడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సి ఉందన్నారు. గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం బియ్యం, కందిపప్పు, నూనె, వంటి 7 రకాల నిత్యావసర సరుకులతో కూడిన షుమారు 4 లక్షల విలువైన్ 4 వందల కిట్స్ అందించడం అభినందనీయమన్నారు. గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం కోసం ముందుకు రావడం, మరింత మంది వారికి అండగా నిల్వడానికి స్పూర్తిగా నిలిచిందన్నారు. రానున్న కాలంలో కూడా గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం ఆపదలో ఉన్నవారిని ఆడుకోవడానికి ముందుండాలని కోరారు.
కార్యక్రమంలో సీనియర్ సంఘ కాపరి రెవ.యం.గాబ్రియేలు, అసోసియేట్ పాస్టర్ టి.ఈనక్ జార్జ్, వెైస్ ఛైర్మన్ యం.ధర్మారావు, సెక్రటరీ సిహెచ్.రవివర్మ, జాయింట్ సెక్రటరీ ఆర్.సునీల్ బాబు, ట్రెజరర్ ఐ.సుధీర్, స్టాండింగ్ కమీటి మెంబర్సు పి.నానారావు, బి.భూషణం, పివి.ప్రసారావు, డి.పాల్ రాజ్, సంఘ స్త్రీల సమాజము, యౌవ్వన సమాజము, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …