Breaking News

నగరంలో వేగంగా డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు వేగంగా జరుగుతుందని, దశలవారీగా నగరంలోని డ్రైన్ల పై ఆక్రమణలు తొలగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు తెలిపారు. ఆదివారం కమిషనర్ కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్ లో డ్రైన్ల ఆక్రమణలు తొలగింపు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో డ్రైన్లపై ఆక్రమణలను దశలవారీగా పూర్తి స్థాయిలో తొలగిస్తామని స్పష్టం చేశారు. ఓల్డ్ క్లబ్ రోడ్ లో కొన్ని హాస్పిటల్స్ డ్రైన్ పై స్లాబ్ లు వేసి జనరేటర్లు, కార్ పార్కింగ్ లకు వినియోగిస్తున్నారని, దీనివలన డ్రైన్ లో ఉన్న సిల్ట్ తీయడానికి వీలు లేకుండా పోతుందన్నారు. వర్షాల వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలి కాబట్టి వాటిని కూడా తొలగించాలని పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. డ్రైన్ మీద ఉన్న ప్రతి ఆక్రమణ తొలగించాల్సిందేనన్నారు. ఆక్రమణల తొలగింపుకు విధులు కేటాయించ బడిన ప్రతి ఒక్క అధికారి, కార్యదర్శి పూర్తి స్తాయిలో విధుల్లో ఉండాలన్నారు. ఆక్రమణల తొలగింపు వ్యర్ధాలను ఎప్పటికప్పుడు నగరంలోని జిఎంసికి చెందిన లో లెవల్ స్థలాల్లో మెరక చేయడానికి తరలించాలన్నారు.
పర్యటనలో కార్పొరేటర్ పి.సమత, తూర్పు ఎంహెచ్ఓ (ఇంచార్జి) రామారావు, ఈఈ కోటేశ్వరరావు, ఎస్ఎస్ ఆయుబ్ ఖాన్, టిపిఎస్ రసూల్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *