Breaking News

నగర ప్రజలందరికీ సమగ్రంగా నీటిని అందించేందుకు ప్రతిపాదనలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ రిజర్వాయర్ల నుండి ప్రైవేట్ ట్యాంకర్లకు త్రాగునీటి సరఫరా నిలుపుదల చేయాలని, త్వరలో ఆయా ట్యాంకర్లకు నీటిని అందించే అంశంపై నిర్ణయిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఆదివారం కమిషనర్ గుజ్జన గుండ్ల, పెద్ద పలకలూరు రోడ్ లోని జిఎంసి రిజర్వాయర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి, నగర ప్రజలందరికీ సమగ్రంగా నీటిని అందించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని, అప్పటి వరకు ప్రైవేట్ ట్యాంకర్లకు త్రాగునీటిని సరఫరా నిలుపుదల చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో త్రాగునీటి సరఫరా పై సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నామని, కొన్ని ప్రాంతాలకు అరకొరగా, మరి కొన్ని ప్రాంతాలకు అధికంగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. అలాగే నగరపాలక సంస్థ రిజర్వాయర్ ల నుండి కూడా ప్రైవేట్ ట్యాంకర్లకు నీటి సరఫరా నిలుపుదల చేస్తున్నామని, త్వరలో వాటికి నీటిని అందించేందుకు ప్రత్యేక ప్రతిపాదనలు సిద్దం చేస్తామని తెలిపారు. రిజర్వాయర్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రిజర్వాయర్ శుభ్రం చేసిన తేదీని బోర్డ్ మీద రాయాలన్నారు. రిజర్వాయర్ పరిసరాల్లోకి ఇతరాలు రాకుండా చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్ నుండి త్రాగునీటిని ఎక్కడికైనా పంపాల్సి వస్తే ఆయా ట్యాంకర్ల వివరాలు, పంపాల్సిన ప్రాంతానికి చెందిన వారి కొంత మంది ఫోన్ నంబర్లు రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. అనంతరం పెద్ద పలకలూరు, ఉద్యోగ నగర్ ప్రాంతాల్లో పర్యటించి ఆదివారం విధులకు హాజరు కాని ఎన్విరాన్మెంట్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా సెలవులు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో పెండింగ్ లో ఉన్న పారిశుధ్య పనులు 2 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఉద్యోగ నగర్ లో నూతనంగా మంజూరైన రిజర్వాయర్ ఫైల్ వివరాలను ఏఈని అడిగి తెల్సుకొని, ఫైల్ పై సమగ్ర వివరాలతో తనకు వివరించాలన్నారు. స్థానిక ఉద్యోగ నగర్ లోని జిఎంసి రిజర్వ్ స్థలాలను పరిశీలించి, వాటి ప్రస్తుత స్థితి, అభివృద్ధి పై తగిన ప్రతిపాదనలతో రావాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
పర్యటనలో కార్పొరేటర్ వి.శ్రీరామ్ ప్రసాద్, ఏఈ సూరిబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్లు భాస్కర్, డేవిడ్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *