Breaking News

క్రైస్తవ చర్చిలు నిర్మాణానికి కోట్ల విలువైన భూములు ఆక్రమిస్తున్నారు

-బిజెపి వారధి లో ఫిర్యాదు ల పర్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రైస్తవ చర్చిలు నిర్మాణానికి అక్రమం గా కోట్ల విలువైన భూములు కాజేసారు.అధికారులకు లంచాలు ఇచ్చాం ఎవరేం చేయలేరు అంటూ ఛాలెంజ్ విసురు తున్నారని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. కడప జిల్లాలో మైదుకూరు మండలం నంద్యాల పేట గ్రామంలో జాతీయ రహదారి కి ఆనుకుని ఉన్న 11ఎకరాలు ప్రభుత్వ భూమి ని ఆర్ సిఎం చర్చి బిషప్ గాలి బాలి రెడ్డి, చర్చి ఫాదర్ లు సంబుటూరు సురేష్, గుర్రం రవిచంద్ర, ప్రభుత్వ ఉపాద్యాయుడు రవీంద్ర బాబు ఈ ఆక్రమణల కు పాల్పడ్డారు. గతంలో ఆర్డీవో,ఇతర అధికారులు కు ఫిర్యాదు చేసిన పట్టించు కోలేదు అని వారధి లో ఫిర్యాదు దారుడు నాగ మల్లేష్ లిఖిత పూర్వకంగా తెలిపారు.ఆక్రమణ దారులు ఛాలెంజ్ చేస్తున్నారు అధికారులు కు లంచాలు ఇచ్చాం మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అక్టోబర్ లో చర్చి ని ప్రారంభం కానుంది అని చెప్పారని ఫిర్యాదు దారుడు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో హనుమాన్ గిరి గట్టు పై అయ్యప్ప దేవాలయం లో క్రైస్తవ లు కొందరు శిలువ లు ఏర్పాటు చేశారని వాటి ని తొలగించాలని కె.నాగమల్లేశ్వరరావు,సిహెచ్ నరేంద్ర లు వారధి లో ఫిర్యాదు చేశారు. వారధి కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, బిజెపి అధికార ప్రతినిధి యామినీ శర్మ, వారథి సమన్వయ కర్త కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *