గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా తీర్చిదిద్దుకవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళ వారం కమిషనర్ ఛాంబర్ లో మరియు కౌన్సిల్ సమావేశమందిరంలో ఐటిసి ఎంఎస్కె అండ్ ఫినిష్ సొసైటీ రూపొందించిన స్వచ్చత హి సేవా పోస్టర్స్ ని నగర కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్చత హి సేవా లో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు స్వచ్చ గుంటూరు సాధనకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఐటిసి ఎంఎస్కె అండ్ ఫినిష్ సొసైటీ పోస్టర్లను రూపొందించడం అభినందనియమన్నారు. పోస్టర్ల ద్వారా ప్రజల్లో స్వచ్చత పట్ల స్వచ్చ గుంటూరు పట్ల అవగాహన కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఐటిసి ఎంఎస్కె అండ్ ఫినిష్ సొసైటీ నుండి నిరంజన్, నారాయణ మరియు తిరుపతి రెడ్డి, జిఎంసి అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్,శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్.ఈ. శ్యాం సుందర్, ఎంహెచ్ఓలు మధుసూదన్, రామారావు, మేనేజర్ ప్రసాద్, అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags guntur
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …