తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 మార్గదర్శకాలను, ఆవాస్ ప్లస్ 2024 యాప్ ను గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ గారు ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వర్చువల్ విధానంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు సంబంధిత అధికారులు, లబ్దిదారులతో కలిసి హాజరై ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. మంగళవారం ఉదయం గత ఆరు నెలలలో పిఎంఏవై అర్బన్, ఏహెచ్పి కార్యక్రమం కింద పూర్తయిన ఇళ్లకు నేడు గృహప్రవేశాలను ప్రధాన మంత్రి వర్చువల్ విధానం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లాలోని పలు నియోజక వర్గాలలో సదరు గృహాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. జిల్లా సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారి లబ్ధిదారులకు గృహ ప్రవేశ ప్రారంభ సూచకంగా నమూనా కీ ని లబ్దిదారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …