రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దైవిక వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజును ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17 న విశ్వకర్మ జయంతి వేడుకగా నిర్వహించు కోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశ్వ కర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పూజను నిర్వహిస్తారు. ఈ సందర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా, ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డ మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. శ్రీ కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారక నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించిన గొప్ప ఆర్కిటెక్చర్ అన్నారు. హిందూ సనాతన ధర్మంలో దివ్య వడ్రంగి గా విశ్వ కర్మ మహోన్నత శిఖరాలు అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ . చిన్న రాముడు, టూరిజం ప్రాంతీయ సంచాలకులు వి. స్వామీ నాయుడు, జిల్లా బిసి సంక్షేమ అధికారి బి శశాంక, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎస్ జ్యోతి, డిపిఆర్వో ఐ. కాశయ్య, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Tags rajamandri
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …