Breaking News

పర్యాటక ఎక్సలెన్స్ అవార్డులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవమ్-2024 ను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి పర్యాటక ఎక్సలెన్స్ అవార్డులకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా పర్యాటక శాఖ అధికారి ఒక ప్రకటన కోరారు. 2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారు 38 విభాగములకు సంభంధించి 41 అవార్డులకు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నారన్నారు. ఉత్తమ కార్యనిర్వహణ పద్ధతులు అవలంబించిన టూర్ ఆపరేటర్లూ, ట్రావెల్స్, హోటల్ తదితర ఆసక్తికల్గిన సంబంధిత సంస్థలు www.tourism.ap.gov.in website నుండి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొనవచ్చును. పూర్తి చేసిన ధరఖాస్తులను ఈ నెల 22 వ తేదీ లోపు కార్యాలయ పనివేళల యందు ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఎ. పి టూరిజం అధారిటీ, 5th Floor, స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, విజయవాడ కార్యాలయము నందు అందజేయాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి శిల్ప ఆ ప్రకటన కోరారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *