Breaking News

రోడ్ విస్తరణ పనులు వేగవంతం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని రెడ్డిపాలెం రోడ్ విస్తరణ పనులు వేగవంతం చేయాలని, 3 రోజుల్లో విస్తరణపై డ్రాఫ్ట్ నివేదిక ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ రెడ్డిపాలెం రోడ్ విస్తరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరగాలని, లేకుంటే ప్రజలు ఇబ్బందులు పడుతుంటారన్నారు. రెడ్డిపాలెం రోడ్ విస్తరణ పనుల పై డ్రాఫ్ట్ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మాణం చేసే రోడ్లను ఎండ్ టు ఎండ్ చేపట్టేలా ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. విస్తరణ పనులు వేగంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెడ్డిపాలెం ప్రాంతంలో మెయిన్ రోడ్ లో చెత్త కుప్పలు అధికంగా ఉన్నాయని, అదనపు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని తొలగించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
అనంతరం నగరపాలక సంస్థ వెహికిల్ షెడ్ ని తనిఖీ చేసి, నగరంలో చెత్త తరలించడానికి వినియోగించే ఏ వాహనం రిపేరు పేరుతో ఆగడానికి వీలు లేదన్నారు. 10 రోజుల్లో వాహనాలు అన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. మరమత్తులను 2 రోజుల్లోపు పూర్తి చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కాల పరిమితి ముగిసిన వాహనాలను నిర్దేశిత నిబందనల మేరకు కండెం కు చర్యలు తీసుకోవాలని, ఎస్.ఈ.ని నేరుగా వాహనాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ-ఆటోల సర్వీస్ సెంటర్ ని 10 రోజుల్లో వెహికిల్ షెడ్ లో అవసరమైన సిబ్బందితో ఏర్పాటు చేయాలని ఏజన్సీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. పర్యటనలో ఎస్.ఈ. శ్యాం సుందర్, ఈఈ కొండారెడ్డి, డిఈఈ సతీష్, టిపిఎస్ సువర్ణ కుమార్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *