Breaking News

దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుండి 12, 2024 వరకు జరిగే దసరా మహోత్సవాలకు విజయవాడ నగరపాలక సంస్థ చేయవలసిన ఏర్పాట్లను సర్వం సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తన చాంబర్లో దసరా ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు కలకుండా విజయవాడ నగరపాలక సంస్థ అన్ని రకమైన చర్యలు తీసుకుంటుందని వరకు కావాల్సిన త్రాగునీటి ఏర్పాట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, క్లారక్ రూంలు, పారిశుద్ధ్య నిర్వహణ, గుడి వరకు వెళ్లే రోడ్లకి ప్యాచ్ వర్క్ల ఏర్పాట్లు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. శరన్నవరాత్రుల్లో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 35 లక్షల త్రాగునీటి వాటర్ బాటిల్స్ మరియు ప్యాకెట్లు, 150 తాత్కాలిక మరుగుదొడ్లు, 6 క్లారక్ రూములు, 27 ప్రాంతాలతో 1400 పారిశుద్ధ్య కార్మికులతో మూడు షిఫ్ట్ లలో పారిశుద్ధ్య నిర్వహణ, 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు, భక్తులు వెళ్లే గిరి ప్రదక్షిణ దారిలో ప్యాచ్ వర్క్ ఇలాంటి ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో లాగానే ఈసారి కూడా భవాని భక్తుల రెడ్ క్లాత్ కొరకు కన్వేయర్ బెల్ట్, 18 ట్రాక్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *