Breaking News

అభివృద్ధి దిశగా అహర్నిశలు శ్రమస్తు పయనించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆశయాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే విజయవాడ నగరపాలక సంస్థ అహర్నిశలు శ్రమిస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో విజన్ 2047 పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రవేశపెట్టిన సంపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా 2047 సంవత్సరం నాటికి, విజయవాడ నగరపాలక సంస్థ ఎలా ఉండబోతుంది ఎలా ఉండాలి దానికి ప్రణాళిక కార్యాచరణ గురించి అధికారులతో చర్చించారు. అందుకు అనుగుణంగా ముందుగా ఐదు సంవత్సరాలకు ప్రణాళిక సిద్ధం చేయాలంటూ 2024 నుండి 2029 వరకు ఎటువంటి విజయవాడ నగరపాలక సంస్థ ఎలాంటి అభివృద్ధిని చేయబోతోంది అన్న అంశాల గురించి ప్రణాళిక సిద్ధం చేసి వాటి కార్యాచరణ చూపిస్తూ, అన్ని శాఖధిపతులు వారి వారి శాఖల నుండి ఒక నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేందుకు విజయవాడ నగరపాలక సంస్థ అహర్నిశలు శ్రమస్తు, అభివృద్ధి దిశగా పయనించాలని అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *