Breaking News

ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయండి… : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మంజూరైన 7 ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.నూతనంగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల పై హైలెవల్ కమిటీ సమావేశం సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో సిఎస్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శంఖు స్థాపన చేసిన నేపథ్యంలో ఇప్పటికే మొదటిదశ కింద చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను వేగవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల అధికారులను ఆదేశించారు.
ఈపిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే అప్పగించడం తోపాటు మిగతా అవసరమైన భూమిని త్వరితగతిన సేకరించాలని వీడియో సమావేశం ద్వారా పాల్గొన్న సంబంధిత కలెక్టర్లను ఆయన ఆదేశించారు.ఇంకా వీటి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై సిఎస్ కమిటీ సభ్యులు అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, మత్స్య శాఖ కమీషనర్ కన్నబాబు, ఆర్థిక శాఖ ఇఓ కార్యదర్శి సత్యనారాయణ, మైనార్టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్,ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *