విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్ను దుర్గగుడి స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, కంచి కామకోటి పీఠం వారి సంప్రదాయ పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణుభట్ల పద్మావతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘నేటి పత్రిక ప్రజావార్త’ యాజమాన్యానికి అభినందనలు తెలిపి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వుంటూ ప్రజల మన్ననలు పొందుతూ నిత్యం ప్రజలలో వుంటూ అనునిత్యం ప్రజలకు ముందుగా వార్తలు అందజేస్తున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ అటు పేపర్గాను, ఇటు డిజిటల్ సోషల్ మీడియాలోను మరింత ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని అభిలషించారు.
Prajavartha Online Telugu News