–జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 17వ తేదీన స్వర్ణ భారత ట్రస్ట్ 23 వ వార్షికోత్సవానికి భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సతీ సమేతంగా హాజరు కానున్నారని, ఆ సందర్భంగా వారు రేణిగుంట విమానాశ్రయానికి 17వ తేదీ ఉదయం 9.40 గం. లకు చేరుకోని నెల్లూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లి తిరిగి సాయంత్రం 3.35 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, భద్రత తదితర అంశాలపై ఎయిర్పోర్ట్ నందు ఎస్పీ సుబ్బరాయుడు, జెసి శుభం బన్సల్ తో కలిసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ దిశా నిర్దేశం చేశారు. గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నందు సమన్వయ సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడుతూ భారత ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా, భద్రత ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, కాన్వాయ్ వెహికల్స్ ఏర్పాటు, ఎయిర్ పోర్ట్ నందు విఐపి లాంజ్ తదితరాల ఏర్పాటు, ప్రోటోకాల్ అంశాలు తదితర విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో డి ఆర్ ఓ పెంచల కిషోర్ అడిషనల్ ఎస్.పి లు వెంకట్రావు, కులశేఖర్. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస రావు తదితర అధికారులు పాల్గొన్నారు.