-పులివర్తి నాని చేతుల మీదుగా జాతీయ పతాకం ఆవిష్కరణ చేసి గౌరవ వందనం చేశారు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రగిరి తాసిల్దార్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని ఆయన చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ చేసి జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి తాసిల్దార్, సబ్ రిజిస్టార్, పోలీసులు, విద్యుత్, వైద్య ఇతర అధికారులు నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News