మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ సాహిత్య పరిషత్- మచిలీపట్టణం ఆధ్వర్యంలో ఆదివారం మచిలీపట్నం పోర్ట్ రోడ్డులోని జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ప్రముఖ రచయిత్రి పల్లావఝల వెంకట శైలజ రచించిన సాయి చరిత శతకం ఆవిష్కరణ సభ జరిగింది. భారతీయ సాహిత్య పరిషత్ ఉపాధ్యక్షులు అంబటిపూడి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిధిగా, గ్రంధ ఆవిష్కర్తగా రాష్ట్ర మైన్స్, జియాలజి అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విచ్చేసి శతకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతి స్వీకర్తగా, గౌరవ అతిధిగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి సాయి చరిత శతకం తొలి ప్రతి స్వీకరించారు. ఆత్మీయ అతిధిగా ఆర్.కే విద్యాసంస్థల అధినేత బండి రామకృష్ణ, గ్రంధ విశ్లేషకులుగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ, ఆత్మీయ అతిధిగా జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, సాహితీ మిత్రులు లంకిశెట్టి బాలాజీ విచ్చేశారు. కార్యక్రమాన్ని భారతీయ సాహిత్య పరిషత్ – మచిలీపట్నం అధ్యక్షులు కారుమూరి రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి ముదిగొండ శాస్త్రి పర్యవేక్షించారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …