Breaking News

“తపాలా అదాలత్”

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా సేవలకు సంబంధించి వినియోగదారుల యొక్క ఫిర్యాదులు మరియు సమస్యలు పరిష్కరించు నిమిత్తము తేది: 03/09/2024 మధ్యాహ్న 3:00 గంలకు, డి.యస్.వి.ఆర్. మూర్తి (IPOS), పోస్ట్ మాస్టర్ జనరల్, విజయవాడ రీజియన్, విజయవాడ వారిచే రీజనల్ తపాలా అదాలత్ నిర్వహించబడును. తపాలా సేవలకు సంబంధించిన ఫిర్యాదులు మరియు సమస్యలు ఈ అదాలత్ నందు పరిష్కరించబడును. తపాలా వినియోగదారులు తమ సమస్యలు మరియు ఫిర్యాదులు తేది: 02/09/2024 లోగా “తపాలా అదాలత్” శీర్షికతో అసిస్టెంట్ డైరక్టర్ (స్టాఫ్), పోస్ట్ మాస్టర్ జనరల్ వారి కార్యాలయం, గాంధీనగర్, విజయవాడ-520003 అను చిరునామాకు పంపవలసినదిగా కోరడమైనది. ఫిర్యాదు దారులు వ్యక్తిగతంగా కూడా హాజరు కావొచ్చునని పోస్ట్ మాస్టర్ జనరల్ వారు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *