Breaking News

వరద బాధితుల సహాయానికి సీఎంఆర్ఎఫ్ కు వెల్లువెత్తుతున్న విరాళాలు

-విజయవాడ కలెక్టరేట్ వద్ద సీఎంను కలిసి విరాళాలు అందిస్తున్న దాతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పలువురు దాతలు తమ ఔధార్యాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందిస్తున్నారు. విరాళాలు అందించిన వారిలో….
1. నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.25 లక్షలు
2. కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ రూ.25 లక్షలు
3. LVR & సన్స్ క్లబ్ రీడింగ్ కమిటీ సభ్యులు రూ.25 లక్షలు
4. చుక్కపల్లి రమేష్ రూ.25 లక్షలు
5. ఏపీ ఫౌల్ర్టీ అసోసియేషన్ రూ. 25 లక్షలు
6. గుంటూరు క్లబ్ రూ.10 లక్షలు
7. తెనాలి డబుల్ హార్స్ రూ.10 లక్షలు
8. ఐఎఏఎస్ ఆఫీసర్స్ వైవ్స్ అసోషియేషన్ రూ.5 లక్షలు(అందించిన వారు రేష్మా ప్రసాద్(ప్రెసిడెంట్), పద్మవల్లి(సెక్రటరీ), ప్రభా భాస్కర్, కృష్ణబాబు)
9. చిలకమర్రి శ్రీనివాసాచార్యులు రూ. 1,50,000(నగదు)
10. షేక్ బాజీ రూ.50,000
11. సీ.జగదీష్ సాయి రూ.21,000 (మంత్రి సవితమ్మ కుమారుడు, 6వ తరగతి, కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులు) విరాళం అందించారు..
ఈ మేరకు సంబంధిత చెక్కులు, నగదును సీఎం చంద్రబాబుకు అందించారు. విపత్కర పరిస్థితుల్లో బాధితుల పక్షాన నిలిచేందుకు వస్తున్న ప్రతి ఒక్క దాతకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *