Breaking News

వరద బాధితులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ లోని ముంపు బాధితులకు గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి బుధవారం కామకోటి నగర్ లో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందన్నారు. ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరద ప్రభావితం చేయడం దురదృష్టకరమన్నారు. ఆరోగ్యపరంగా, ఆహారపరంగా, బాధితులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు. బాధితులకు నిత్యవసర సరుకులతో పాటుగా మందులను కూడా పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు సత్యవాణి, శివలీల, వేపాటి పద్మ , 39 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు రేగళ్ల లక్ష్మణరావు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *